యూనిట్

ప్రజాశ్రేయస్సు కోసమే ప్రాణాలర్పించారు

పోలీసులు ప్రజా శ్రేయస్సు కోసమే ప్రాణాలర్పిస్తారని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభించన సందర్భముగా ఆయన మాట్లాడారు. పోలీసులు, జవాన్లు దేశరక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్నారు, వారి సంస్మరణార్ధం ఈ వారోత్సవాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రధర్శన, వ్యాసరచన పోటీలు, నిర్వహించారు. కార్యక్రమంలో ఓ.ఎస్‌.డి ఆంజనేయులు, ఏ.ఆర్‌.అదనపు ఎస్పీ రాధాకృష్ణ, సి.ఐలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని