యూనిట్

రాజస్థాన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు

విజయవాడలో షాపుల షట్టర్ల కు వేసిన తలలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిసిఎస్ ఎసిపి కె. శ్రీనివాస రావు తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. విజయవాడ నగరంలో ని వన్ టౌన్ ప్రాంతంలో రాత్రి సమయంలో షాపుల షట్టర్లు పగలగొట్టి కాష్ కౌంటర్లులో వున్న నగదు, బంగారములు చోరీకి గురవుతున్నట్లు పిర్యాదులు అందాయి. అప్రమత్తమైన సిసి ఎస్ పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో వన్ టౌన్ ఏరియాలో రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజస్థాన్ కు చెందిన మంగీలాల్, శైల్ సింగ్, రమేష్ రాబరి, కన్నయ్ లాల్ లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. వీరు పాత నేరస్థులు. వన్ టౌన్ ఏరియా లో షాప్ ల్లో పనిచేస్తున్న వీరి స్నేహితుల ఇంట్లో ఉంటూ విజయవాడలో దొంగతనాలు పాల్పడుతున్నారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 7 .౩ లక్షల నగదు మరియు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన సి. ఐ లు పి. వెంకటేశ్వర రావు, సిహెచ్ పి కృష్ణంరాజు, సి హెచ్ చలపతి రావు, ఎస్సైలు సి. హెచ్ నాగ శ్రీనివాస్, వై ఎస్ రమేష్, సిబ్బంది స్వామి, రమణ, ప్రసాద్, గోపి, ప్రవీణ్, ఆరీఫ్ లకు అభినందించారు.

వార్తావాహిని