యూనిట్

సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

చిత్తూరు జిల్లాల్లో సెల్ ఫోన్లను దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 20 లక్షల విలువైన 108 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ ఎన్. సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలను డీఎస్పీ వివరించారు.  గంగమ్మ గుడి వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రెండు సెల్ ఫోన్లను దొంగలించారని వచ్చిన ఫిర్యాదు  మేరకు పలమనేరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్  సి.చంద్రశేఖర్, ఎస్సై బి. వి.సుబ్బారెడ్డి  ఆధ్వర్యంలో క్రైం సిబ్బందిని రెండు టీం లు ఏర్పాటు చేసారు. దర్యాప్తులో   భాగంగా జండామటం కు చెందిన బి.సూరిబాబు ఇంట్లో తనిఖీ చేయగా, 108 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సూరిబాబు ఇచ్చిన సమాచారం మేరకు అతనితో దొంగతనాలకు పాల్పడుతున్న కె. యస్వంత్ సాయి, ఎస్. యూసఫ్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని విచారించగా  వీరు ముగ్గురూ ఒక టీం గా ఏర్పడి, పాత కార్లను తీసుకొని బస్ స్టాండ్ ల వద్ద నిద్రపోతున్న వ్యక్తుల వద్ద, రోడ్డు ప్రక్కన ఉన్న షెడ్ల వద్ద నిద్రపోతున్న వ్యక్తుల వద్ద, తలుపు తీసి నిద్రపోతున్న వారి యొక్క ఇళ్ళలో మరియు కూరగాయల మార్కెట్ వద్ద జన సమూహంతో గుంపుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రాంతాలలో సెల్ ఫోన్ లను దొంగలిస్తారాని తెలిపారు. సెల్ ఫోన్లను పలమనేరు టౌన్, బంగారుపాళ్యం, సోమల, బైరెడ్డిపల్లి, చౌడేపల్లి, పుత్తూరు,తిరుపతి,నెల్లూరు, కడప, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు మరియు తమిళనాడు రాష్ట్రం లోని క్రిష్ణగిరి, ధర్మపురి, కంచి, చెన్నై తదితర ప్రాంతాలలో దొంగలించారు. 108 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ల విలువ సుమారు 20 లక్షల రూపాయలుగా ఉంటుంది.  కేసులో ప్రతిభ కనబరచిన క్రైం సిబ్బంది ఏ ఎస్సైలు  దేవరాజులు రెడ్డిశ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్, కానిస్టేబుళ్లు వేణు గోపాల్, అల్లావుద్దీన్, ప్రకాష్ నాయుడు, అశోక్, బాలాజీ, శశిధర్ లకు రివార్డు కొరకు జిల్లా ఎస్పీకి సిపార్సు చేయడమైనది.

వార్తావాహిని